నేడు అమరావతిలో బాలకృష్ణ

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన రాజధాని అమరావతి కోసం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం [more]

Update: 2020-01-15 03:40 GMT

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆయన రాజధాని అమరావతి కోసం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతారు. గత నెల రోజులుగా అమరావతిపై రచ్చ జరుగుతున్నా బాలకృష్ణ నోరు మెదపలేదు. ఇది పార్టీలోనూ చర్చనీయాంశమైంది. బాలకృష్ణ ఎందుకు మౌనం వహించారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి తెరదించుతూ బాలకృష్ణ నేడు అమరావతిలో పర్యటించనున్నారు.

Tags:    

Similar News