రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబీషన్..!

నాంపల్లి ఎగ్జిబిషన్ శనివారం నుండి ప్రారంభమవుతుందని, కాలిపోయిన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని మరో రెండు రోజుల్లో నిర్మించి నిర్వాహకులకు అప్పగిస్తామని సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. [more]

Update: 2019-02-01 13:56 GMT

నాంపల్లి ఎగ్జిబిషన్ శనివారం నుండి ప్రారంభమవుతుందని, కాలిపోయిన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని మరో రెండు రోజుల్లో నిర్మించి నిర్వాహకులకు అప్పగిస్తామని సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం నుంచి బాధితులు కొలుకుంటున్నారని ఆయన చెప్పారు. అగ్నికి ఆహుతైన 300 స్టాల్స్ ను అదే స్థలంలో కొత్త వాటిని నిర్మించేందుకు సొసైటీ ఏర్పాట్లు చేస్తుందన్నారు. అందులో భాగంగా అగ్నికి కాలి బుడిదైన వస్తువులను, రేకులను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. కొత్త స్టాల్ లను నిర్మిచడంతో పాటు, స్టాల్ నిర్వాహకులకు 70 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు సొసైటీ కార్యదర్శి తెలిపారు. బాధితులకు సొసైటీ అండగా ఉంటుందని … ప్రమాదం ఘటనపై కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఎగ్జిబిషన్ ను అదనంగా నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News