ఏపీ మంత్రికి, వైసీపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిల్ బుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్ మంత్రికి, ఎమ్మెల్యేకు నాంపల్లి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ [more]

Update: 2021-03-06 00:45 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రికి, ఎమ్మెల్యేకు నాంపల్లి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు నోటీసులు జారీ చేసింది. హెరిటేజ్ కేసులో విచారణకు హాజరు కాలేదన్న కారణంగా వీరిద్దరికి నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. త్వరిత గతిన కేసులు విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజకీయ నేతల కేసులను సత్వరం పరిష్కరించేందుకు విచారణను చేపడుతోంది. వచ్చే విచారణకు వీరిద్దరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు పేర్కొంది.

Tags:    

Similar News