బ్రేకింగ్ : డిప్యూటీ సీఎంపై ఫైర్ అయిన రోజా…హైకమాండ్ కు ఫిర్యాదు

చిత్తూరు జిల్లా వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుత్తూరులో నారాయణస్వామి, కలెక్టర్ పర్యటనపై రోజా అభ్యంతరం [more]

Update: 2020-05-26 06:46 GMT

చిత్తూరు జిల్లా వైసీపీలో విభేదాలు ముదురుతున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుత్తూరులో నారాయణస్వామి, కలెక్టర్ పర్యటనపై రోజా అభ్యంతరం తెలిపారు. తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండా ఎలా పర్యటిస్తారని రోజా ప్రశ్నించారు. పుత్తూరులో అంబేద్కర్ భవన్ స్థల పరిశీలన కోసం నారాయణస్వాి, కలెక్టర్ పర్యటించారు. తాను అందుబాటులో ఉన్నా తనకు చెప్పకుడా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని రోజా ఫైర్ అయ్యారు. అందుబాటులో తాను ఉన్నా పట్టించుకోలేదన్నారు. గతకొంతకాలంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రోజాల మధ్య వివాదాలు ఉన్నాయి. గతంలో నారాయణస్వామి స్వయంగా వెళ్లి రోజాతో మాట్లాడారు. మరోసారి నగరి నియోజకవర్గంలో తనకు తెలియకుండా పర్యటించడం పై ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News