నాగం పాత డైలాగ్ ని మర్చిపోలేదే...

Update: 2018-07-03 09:54 GMT

తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో నాగం జనార్ధన్ రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలే. నాగం కూడా కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి. అయితే, పరిస్థితుల ప్రభావంతో ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ లోనే చేరాల్సి వచ్చింది. అయినా, నాగం పాత డైలాగ్ ను మర్చిపోలేదు. మంగళవారం గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడుతూ...‘కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారింది’ అన్నారు. దీంతో అక్కడి విలేఖరులంతా ఒక్కసారిగా అవాక్కయ్యరు. వెంటనే తేరుకుని సారీ.. తెరాస అవినీతి అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ ల అవినీతిని బయటపెడతానని, హరీష్ రావు ఒక యూజ్ లెస్ ఫెలో అని తీవ్రంగా విమర్శించారు. తనకు సెక్యూరిటీ తొలగిస్తే బయపడనని, ప్రజలే తన సెక్యూరిటీ అన్నారు. ఇక ఇంతకాలం వైఎస్ఆర్ పై ఒంటికాలితో లేచే నాగం...108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ప్రవేశిపెట్టారని ప్రశంసలు కురిపించారు.

Similar News