దీనిపై నిగ్గు తేల్చాల్సిందే

పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గేటు విరిగిపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రాజెక్టు [more]

Update: 2021-08-07 02:21 GMT

పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గేటు విరిగిపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రాజెక్టు ఎంతవరకూ పదిలం అన్న దానిపై నిపుణులతో కమిటీని వేసి నిగ్గుతేల్చాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టును ఎలా కాపాడతారో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నది వాస్తవమని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Tags:    

Similar News