షర్మిల పార్టీపై మైసూరా ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో వైఎస్ షర్మిల చిత్తశుద్ధితోనే పార్టీ పెట్టినట్లు కన్పిస్తుందని సీనియర్ నేత మైసూరా రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆ పార్టీ నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే [more]

Update: 2021-07-21 14:36 GMT

తెలంగాణలో వైఎస్ షర్మిల చిత్తశుద్ధితోనే పార్టీ పెట్టినట్లు కన్పిస్తుందని సీనియర్ నేత మైసూరా రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆ పార్టీ నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే షర్మిల నిజాయితీగానే పార్టీ పెట్టినట్లు కన్పిస్తుందన్నారు. జగన్ చెబితేనో, కేసీఆర్ పరోక్షంగా సహకారం అందిస్తేనో, బీజేపీ అండగా ఉంటేనో షర్మిల పార్టీ పెట్టినట్లు తాను భావించడం లేదని మైసూరారెడ్డి అన్నారు. అయితే ఆ పార్టీ ఎంత మేరకు ప్రజాదరణ పొందుతుందన్నది కాలమే సమాధానం చెబుతుందని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైసూరారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News