వామనరావు దంపతుల హత్య కేసులో?

వామన్ రావు, నాగమణి దంపతుల హత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు స్థాయి నివేదికను హైకోర్టుకు పోలీసులు సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ వద్ద [more]

Update: 2021-04-08 00:59 GMT

వామన్ రావు, నాగమణి దంపతుల హత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు స్థాయి నివేదికను హైకోర్టుకు పోలీసులు సమర్పించారు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు ఎఫ్ఎస్ఎల్ కి పంపించామన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే మే 17 నాటికి హత్య జరిగి 90 రోజులు కానుంది. ఈలోపు సమగ్ర ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పోలీసుల నివేదికలు తమకు ఇచ్చేలా ఆదేశించాలని కోరిన వామన్ రావు తండ్రి తరఫు న్యాయవాది కోరాగా ఆ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది.

Tags:    

Similar News