అంత కిరాతకంగా ఎందుకు నరికాడంటే...?

Update: 2018-09-26 13:43 GMT

హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఫిల్లర్ నెం 145 వద్ద అందరూ చూస్తుండగానే గొడ్డలితో ఓ వ్యక్తిని ఇద్దరు కలిసి నరికి చంపారు. దాదాపు 100 మీటర్లు వెంటాడి మరి హత్య చేశారు. రక్షించమని మృతుడు ఆర్తనాధాలు చేసినా ఎవరూ కాపాడలేకపోయారు. గత సంవత్సరం జరిగిన ఓ హత్యలో మృతుడు రమేష్ గౌడ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రమేష్ చనువు గా ఉండే వివాహిత పట్ల మహేష్ గౌడ్ అసభ్యంగా మాట్లాడడం జీర్ణించుకోలేక రమేష్ పథకం ప్రకారం అనుచరులతో కలిసి మహేష్ ని దారుణంగా కొట్టి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు.

పగ పెంచుకుని హత్య...

దీంతో రమేష్ పై పగ పెంచుకున్న మహేష్ తండ్రి, బంధువులు అదను చూసి రమేష్ ను మట్టుబెట్టారు. ఇవాళ ఉదయం కోర్టుకు వెళ్లి వస్తుండగా వెంబధించి నడిరోడ్డుపైనే గొడ్డలితో హత్య చేశారు. స్థానికులు వీడియోలు తీస్తూ నిలబడ్డా ఎవరూ కాపాడలేకపోయారు. దుండగుల చేతిలో గొడ్డలి ఉండటంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఆపలేకపోయారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ పోలీసు వాహనంలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా వారు కూడా ఏమీ చేయలేక పోయారు. హత్య చేసిన తర్వాత నిందితులు పైశాచికత్వంతో అరుస్తూ అక్కడే ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News