కంటెయిన్ మెంట్ జోన్ లలో కేటీఆర్ పర్యటన

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని కంటెయిన్ మెంట్ జోన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటయిన్మెంట్ జోన్లను [more]

Update: 2020-04-16 12:21 GMT

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని కంటెయిన్ మెంట్ జోన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటయిన్మెంట్ జోన్లను సందర్శించిన మంత్రి కేటీఆర్ అక్కడి ప్రజలతో మాట్లాడారు. మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురితో ఆయన మాట్లాడారు. ఆయా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ బయటకి రాకుండా ఇళ్ల కి పరిమితం కావడం ద్వారానే సురక్షితంగా ఉండగలుగుతామని, లేదంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

Tags:    

Similar News