పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోకండి.. జగన్ కు ముద్రగడ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ముద్రగడ ఆ [more]

Update: 2020-07-03 04:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ముద్రగడ ఆ లేకలో కోరారు. నవీన్ పట్నాయక్, జ్యోతి బసు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పూజలందుకోవాలని గాని, పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని లేఖలో ముద్రగడ పద్మనాభం కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ తో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై తేల్చాలని ఆయన లేఖలో కోరారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. గతంలో కాపు రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Tags:    

Similar News