కండకావరానికి అరదండాలు

Update: 2018-06-18 06:50 GMT

చేతిలో అధికారం ఉంది కదా అని కండకావరం చూపిన ఎంపీపీ గోపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎంపీపీ ఇమ్మడి గోపి తన ఇంటిని పది నెలల క్రితం రూ.33 లక్షలకు రాజవ్వ అనే మహిళకు విక్రయించాడు. అయితే, నెలలు గడుస్తున్నా ఇంటిని రాజవ్వకు అప్పగించలేదు. దీనికి తోడు ఇంకా రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. రాజవ్వ కుటుంబసభ్యులు గట్టిగా అడిగితే, తాను మాజీ నక్సలైట్ నని, అధికారం తన చేతిలో ఉందని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై గత వారం కూడా ఇరువురికి మధ్య గొడవ జరిగింది. ఆదివారం మరోసారి రాజవ్వ, బంధువులు వచ్చి గోపీని నిలదీశారు. గోపీ సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రాజవ్వ చెప్పుతీసుకుని గోపీని కొట్టగా, గోపీ ఆమెను కాలితో ఛాతిపై తన్నాడు. దీంతో ఆమెను స్థానిక ఆసుప్రతిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సోమవారం గోపీని అరెస్ట్ చేశారు.

Similar News