బ్రేకింగ్ : టీడీపీ ఎంపీ సస్పెన్షన్

లోక్ సభలో సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ను రెండు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. [more]

Update: 2019-01-07 08:51 GMT

లోక్ సభలో సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ను రెండు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. పదే పదే సభకు శివప్రసాద్ అంతరాయం కల్గిస్తుండటంతో సుమిత్రా మహాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శివప్రసాద్ తో పాటు అన్నాడీఎంకే కు చెందిన ఇద్దరు ఎంపీలను కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ, విభజన హామీలను అమలు చేయాలంటూ టీడీపీ ఎంపీలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ సభ వెలుపల ఆందోళన చేస్తు్న టీడీపీ ఎంపీలు సభలో కూడా ఆందోళన చేస్తుండటంతో ఇటీవల అందరినీ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News