మోత్కుపల్లి మోత మోగించాడు

Update: 2018-05-29 09:33 GMT

‘‘చంద్రబాబు నాయుడు నిన్న నాగొంతు కొసేశారు. గతంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గొంతు కోసినట్లే నా గొంతు కోశారు.ఎందుకంటే నెను ఎన్టీఆర్ శిష్యుణ్ణి అయినందుకే. ఉరిశిక్ష వేసేముందు అయిన చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ ఆయన నన్ను ఏం అడగలేదు? ఎందుకంటే ఆయన ప్రజా సొమ్ము దోసుకోవడానికి మాత్రమే సమయం ఉంది మిగతా వాటికి సమయం లేదు.’’ అని మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

1995 లో ఎన్టీఆర్ చంద్రబాబు ను సస్పెండ్ చేశారని, దానికి ఈ లేఖనే సాక్ష్యమని మోత్కుపల్లి లేఖను మీడియా ముందుంచారు. ‘‘ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేశావ్. నువ్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు, అప్పుడు నువ్ కాంగ్రెస్ లో ఉన్నావు. బిడ్డను ఇచ్చినందుకు నువ్వు మోసం చేశావు. నువ్వు నమ్మకద్రోహివి అని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు.

ముద్దుకృష్ణమ చనిపోవడానికి....

పేదలను మోసం చేసిన వ్యక్తుల్లో నువ్వు మొదటి వ్యక్తివి. నీ వల్ల అనేక మంది చనిపోయారు , మొన్నటికి మొన్న ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు. ఆయన ఎన్టీఆర్ శిష్యుడిగా మంచి పేరు ఉంది. కానీ నువ్వు చేసిన నీచపు రాజకీయాల వలన ఆయన మనోవేదన చెంది చనిపోయాడు. నీ అంత రాజకీయ దుర్మార్గుడు ఎవ్వరూ లేరు’’ అని మోత్కుపల్లి సీరియస్ గా స్పందించారు. ‘‘నిన్ను ఏం అడిగాను? పదవులు ఎప్పుడు అడిగాను? నువ్వు ఇది ఆడిగానీవు అని నిరూపించు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నువ్వు నమ్మక ద్రోహివి. గతంలో ఎన్టీఆర్ విడుదల చేసిన క్యాసెట్ ఉంది.

కుల రాజకీయాలు.....

నిన్ను తిడితే తట్టుకోలేని వ్యక్తివి. ఏ కులం వారు తిడితే వారితోటి తిట్టిపిస్తావు. నీది ఏం నీతి? ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద? రాజ్యసభ సిటు ఇస్తాను అని మోసం చేశావు. నీ కులపోళ్లకు ఇచ్చుకున్నావు. తెలుగుదేశం పార్టీనీది కాదు. జెండా నీది కాదు నువ్వు దొంగలాగా జెండా ను ఎత్తుకుపోయావు. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ,జగన్ , కేసీఆర్ లాగా సొంత జెండా. పార్టీ పెట్టుకో. నువ్వు పిరికి పందవు’’ అని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో చంద్రబాబుకు అధికారం రాదని, ప్రజలు బొందపెడతారని మోత్కుపల్లి శాపనార్థాలు పెట్టారు. ఏపీ ప్రజలను తాను కోరుకునేది ఒక్కటేనని, ఈసారి చంద్రబాబును ఓడించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఎవరో ఒకరిని బలి చేయకపోతే చంద్రబాబు నిద్రపోరని కూడా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Similar News