ఆయనను సీఎంగా చూడాలని ఉంది

Update: 2018-08-27 08:07 GMT

కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని నటుడు మోహన్ బాబు ఆకాంక్షించారు. ఆదివారం కోయంబత్తూరులో నిర్వహించిన కరుణానిధి సంస్మరణ సభకు స్టాలిన్ ఆహ్వానం మేరకు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు స్టాలిన్ కు ధన్యవాదాలు తెలిపారు. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నికల లాంఛనమే కానుంది.

 

Similar News