ముఖచిత్రాన్నే మార్చేశారు

జమ్మూకాశ్మీర్ ముఖచిత్రాన్నే మోదీ ప్రభుత్వం మార్చేసింది. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో కాశ్మీర్ [more]

Update: 2019-08-05 06:45 GMT

జమ్మూకాశ్మీర్ ముఖచిత్రాన్నే మోదీ ప్రభుత్వం మార్చేసింది. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో కాశ్మీర్ స్వయంప్రతిపత్తు రద్దయినట్లయింది. చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉండనుంది. లడఖ్ లో ఇక లెఫ్ట్ నెంట్ గవర్నర్ కే పూర్తి అధికారాలు ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్ ఉండనుంది. అంటే ఢిల్లీ తరహాలో ఇక జమ్మూకాశ్మీర్ లో పాలన సాగనుంది. పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం ఇక జమ్మూ, కాశ్మీర్ లో అమలు కానుంది. జమ్మూకాశ్మీర్ ఇక భారతదేశంలో అంతర్భాగమయిపోయింది.

Tags:    

Similar News