ఇద్దరికి చివరి సమావేశమేగా?

మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశానికి హాజరవుతున్నారు. వారికి ఇదే చివరి సమావేశం. ఈ నెల 19వ [more]

Update: 2020-06-11 02:51 GMT

మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశానికి హాజరవుతున్నారు. వారికి ఇదే చివరి సమావేశం. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 19వ తేదీన ఇద్దరు మంత్రులు తమ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. చివరి సమావేశంలో ఇద్దరు మంత్రులకు మంత్రివర్గ సమావేశం వీడ్కోలు పలుకుతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా ఎమ్మెల్సీలుగా చేసి జగన్ మంత్రి పదవులను ఇచ్చారు.

Tags:    

Similar News