మండలి ఛైర్మన్ గా గుత్తా ఎన్నిక

శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ [more]

Update: 2019-09-11 06:48 GMT

శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డి ని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకు వెళ్లారు. ఆ తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

 

Tags:    

Similar News