రాజధానిపై క్లారిటీ

రాజధాని అమరావతిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ సబ్యుడు అనగాని సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని [more]

Update: 2019-12-10 05:50 GMT

రాజధాని అమరావతిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ సబ్యుడు అనగాని సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. రాజధాని అమరావతి అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలో రైతుల ప్లాట్లను అభివృద్ధధఇ చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. తాను గతంలో రాజధాని పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాజధాని అమరావతిపై జగన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని పట్టించుకోని ప్రభుత్వం ఆరునెలల్లో అభివృద్ధి చేయాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు.

Tags:    

Similar News