అక్బర్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై పరోక్షంగా?

కరోనా సమయం వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్డీన్ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా [more]

Update: 2020-04-24 04:37 GMT

కరోనా సమయం వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్డీన్ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సరైన ఆహారం ఇవ్వడం లేదని, పరిశుభ్రత పాటించడం లేదని, మందులు కూడా సరిగా ఇవ్వడం లేదని అక్బరుద్దీన్ ఆరోపించారు. కేవలం భౌతిక దూరంతోనే కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. పరిశుభ్రత కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలని ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. కరోనా వైరస్ పై పోరడటానికి ఒవైసీ ఆసుపత్రులు కూడా సిద్ధంగా ఉన్నాయని అక్బరుద్దీన్ తెలిపారు.

Tags:    

Similar News