రీపోలింగ్ కావాల్సిందే.. మేకపాటి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. చేజర్ల మండలం [more]

Update: 2019-04-11 10:07 GMT

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. చేజర్ల మండలం పుల్లనీళ్ళ పల్లి లో టీడీపీ రిగ్గింగ్ చేస్తుందని వైసిపి అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. రీపోలింగ్ జరపపాలని మేకపాటి డిమాండ్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి ల మధ్య తోపులాట జరిగింది. కొమ్మి వర్గీయులు గౌతమ్ రెడ్డి తో పాటు, అతని పీ ఏ పై దాడి చేశారు. దీంతో గౌతమ్ రెడ్డి ఆస్వస్తతకు గురయ్యారు. టీడీపీ చేస్తున్న రిగ్గింగ్ అడ్డుకోవడానికి వెళ్తే తమ పై దాడి చేశారని వైసీపీ అభ్యర్థి గౌతంరెడ్డి ఆరోపిస్తున్నారు

Tags:    

Similar News