మహారాష్ట్రలో వారం రోజుల పాటు లాక్ డౌన్

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న [more]

Update: 2021-02-22 01:21 GMT

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. అమరావతి జిల్లాతోపాటు మరికొన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను విధించారు. ఈరోజు నుంచి మరా్చి 1వ తేదీ వరకూ అమరావతి జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అకోలా, యావత్ మల్, బుల్ధానా, వాషిం జిల్లాల్లోనూ ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News