బీజేపీకి షాక్.. రేవంత్ ను కలిసిన?

బీజేపీకి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ నేత ఎర్ర శేఖర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన త్వరలో బీజేపీని వీడి కాంగ్రెస్ [more]

Update: 2021-07-13 06:44 GMT

బీజేపీకి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ నేత ఎర్ర శేఖర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన త్వరలో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. ఎర్ర శేఖర్ గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డితో టీడీపీలో ఉన్న పరిచయాలతో కాంగ్రెస్ కు గూటికి చేరనున్నారు. ఇక సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఇక కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో ఈరోజు భేటీ కానున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ కు తిరిగి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News