పోలీసులపై దాడి చేసి…బోర్డర్ దాటి?

తెలంగాణా నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన రీతిలో నచ్చిన [more]

Update: 2020-03-27 02:08 GMT

తెలంగాణా నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన రీతిలో నచ్చిన రోజు నుంచి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రా కు వచ్చే వారిని సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపివేస్తున్నారు. అయితే దొంగ దారిలో ఆంధ్ర లోపలికి ఎంటర్ కావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ,ఆంధ్ర పోలీసులు గట్టిగా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది వ్యక్తులు వాడపల్లి నుంచి ఆంధ్రా లోపలికి ఎంటర్ కావడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు మాత్రం యువకుల్ని అడ్డుకున్నారు. దీంతో యువకులంతా కలిసి బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారుల పై రాళ్లతో దాడి చేశారు. పోలీసులపై దాడి చేసి తప్పించుకొని ఆంధ్రలోకి యువకులు వెళ్ళిపోయారు. ఊహించని షాక్ తో పోలీసులు వెంటనే ఆంధ్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. యువకుల దాడి లో చాలా మంది పోలీసులు గాయపడ్డారు . గాయపడిన పోలీసు అధికారులను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వాడపల్లి నుంచి ఆంధ్ర లోకి ప్రవేశించిన యువకులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News