ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ సభను సెకన్లలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు ఎప్పటిలాగానే దిగారు. నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభ సెకన్లలోనే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలో ప్రస్తుతం సభ కార్యక్రమాలు జరుగుతున్నాయి.