బ్రేకింగ్ : ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కీలక పరిణామం…12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీఈవో సున్ కే జియాంగ్ [more]

Update: 2020-07-07 14:39 GMT

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీఈవో సున్ కే జియాంగ్ , అడిషనల్ డైరెక్టర్ మోహనరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన వెనక యాజమాన్యం నిర్లక్ష్యం ఉందన్న హైపవర్ కమిటీ నివేదికతోనే పోలీసు యాక్షన్ మొదలయింది. గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది విశాఖలో మృతి చెందిన సంఘటన తెలిసిందే.

Tags:    

Similar News