కాంగ్రెస్ లోకి నేతల క్యూ..!

Update: 2018-09-08 11:54 GMT

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు తిరుబావుటా ఎగురవేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ల ప్రకటనకు ముందు టీఆర్ఎస్ కు దూరమైన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇక ఇవాళ టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగిన కొండా దంపతులు కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్నారు. పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే నారాయణపేట నుంచి గత గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక మరికొంత మంది టీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలతో సంప్రదిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి చేరికలు భారీగా చేరికలు ఉండనున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Similar News