గిన్నీస్ బుక్ వారికి ఉత్తరం రాస్తా

Update: 2018-12-20 12:17 GMT

ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గిన్నీస్ బుక్ లో చేర్చాల్సిందిగా వారికి ఉత్తరం రాద్దామనుకుంటున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. గురువార ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఆరోపించారు. నీరుకొండపై ఎన్టీఆర్ కాంస్య విగ్రహం కేవలం గ్రాఫిక్స్ కే పరిమితమవుతుందన్నారు. ఎన్టీఆర్ పేరుపైన పెట్టిన పథకాలను నీరుగారుస్తున్నారన్నారు.

లోకేష్ కి ‘కా’ అంటే ‘కి’ రాదు...

ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయీ తనకు చెప్పారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని చరిత్ర మరిచిపోదన్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని వాస్తవాలు తాను ఎదురులేని మనిషి పుస్తకంలో రాశానని, ఆ పుస్తకం ఆధారంగానే రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారని తెలిపారు. లోకేష్ కి కా అంటే కి రాదని ఆమె ఎద్దేవా చేశారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు తన స్వార్థానికి వాడుకుంటున్నారని తెలిసే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారన్నారు.

Similar News