టీడీపీలోకి ఆయన వస్తున్నారా…?

రాజకీయ రంగప్రవేశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్ లో మంత్రి [more]

Update: 2019-03-12 06:28 GMT

రాజకీయ రంగప్రవేశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న హైదరాబాద్ లో మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయిన ఆయన ఈ మేరకు చర్చలు జరిపినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. లక్ష్మీనారాయణ విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన మొదట సొంతంగా పార్టీ పెడతారని, బీజేపీలో, జనసేనలో, లోక్ సత్తాలో చేరతారని ప్రచారం జరిగింది. చివరకు ఆయన టీడీపీలో చేరబోతున్నారు.

Tags:    

Similar News