వైసీపీ పాలనపై లగడపాటి ఏమన్నారంటే?

వైసీపీ పాలనపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు మూడేళ్ల తర్వాత తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పోటీ తత్వం పెరగడం [more]

Update: 2021-03-11 02:14 GMT

వైసీపీ పాలనపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు మూడేళ్ల తర్వాత తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో పోటీ తత్వం పెరగడం వల్లనే సంక్షేమ కార్యక్రమాలకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలన్స్ చేయాలని లగడపాటి రాజగోపాల్ సూచించారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా వ్యవహారశైలి బాగుందన్నారు. పవన్ కల్యాణ్ ఓటమి పాలయినా ప్రజలనే అంటిపెట్టుకుని ఉండటం అభినందనీయమన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు, సర్వేలకు దూరంగా ఉంటానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News