విలీనంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని రమణ అన్నారు. [more]

Update: 2021-04-09 01:56 GMT

తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని రమణ అన్నారు. టీడీపీ బీ ఫారంపై సైకిల్ గుర్తుపై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని రాజ్యంగానికి కేసీఆర్ తూట్లు పొడిచారన్నారు. తాము దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఎల్ రమణ చెప్పారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచినప్పుడు విలీనం సాధ్యం కాదని ఎల్. రమణ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News