పరారీలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన తాహసిల్దార్ ను దూషించిన కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పోలీసులు కూన రవికుమార్ పై కేసు [more]

Update: 2020-05-27 03:31 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన తాహసిల్దార్ ను దూషించిన కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పోలీసులు కూన రవికుమార్ పై కేసు నమోదు చేశారు. ఆయన కోసం గత మూడు రోజుల నుంచి పోలీసులు వెదుకుతున్నారు. మహానాడు నేటి నుంచి ప్రారంభం అవుతుండటంతో పోలీసు స్టేషన్ లో కూన రవికుమార్ లొంగిపోవాలని నిర్ణయించుకునట్లు తెలుస్తోంది. పొందూరు పోలీస్ స్టేషన్ లో మరికొద్దిసేపట్లో కూన రవికుమార్ లొంగిపోయే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News