కాంగ్రెస్ కి కుప్పలుగా డబ్బు వస్తోంది

Update: 2018-12-04 08:25 GMT

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ, అమరావతి, కర్ణాటక నుంచి విచ్చలవిడిగా డబ్బుల మూటలు వస్తున్నాయని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన రోడ్ షో ఆయన మాట్లాడుతూ... కుప్పలుగా వస్తున్న ఆ సొమ్ముతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్ని కోట్లు పంచినా ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని కోరారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా... చంద్రబాబు నోట్లు ఇచ్చినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.

Similar News