మరికొద్దిసేపట్లో కేబినెట్...కేటీఆర్...?

Update: 2018-09-02 07:18 GMT

తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి మంత్రి వర్గ సమావేశం నుంచి మినహాయింపు లభించింది. మరికాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఇద్దరికీ సమావేశం నుంచి కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు.

ఏర్పాట్లు పర్యవేక్షించాలని.....

ఇప్పటికే కొంగర కలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభకు లక్షల సంఖ్యలో జనం వస్తుండటం, వారికి భోజన, మంచినీటి సదుపాయాలు కల్పించడం వంటివి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరు మంత్రులు కొంగర్ కలాన్ లోనే ఉండిపోయి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కళాకారులతో కలసి డ్యాన్స్ చేశారు.

Similar News