అరాచకాలకు దళితులే బుద్ధి చెబుతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నివాసానికి ఎదురుగా ఉన్న [more]

Update: 2021-07-22 07:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నివాసానికి ఎదురుగా ఉన్న పేదల గుడిసెలను తొలగించి వారిని వీధిన పడేశారని జవహర్ ఆరోపించారు. బైబిల్ నిబంధలను అనుసరిస్తున్నానని చెప్పే జగన్ పేదల గుడెసెలను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులు జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారని జవహర్ శాపనార్థాలు పెట్టారు.

Tags:    

Similar News