ఆ సామాజిక వర్గానికే 26 కార్పొరేషన్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవుల పేరిట ఏదో సాధించానని అనుకుంటున్నారని మాజీ మంత్రి జవహర్ అభిప్రాయపడ్డారు. ఈ హడావిడి అంతా కొన్ని వర్గాలను ఆకట్టుకోసమేనని [more]

Update: 2021-07-17 13:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవుల పేరిట ఏదో సాధించానని అనుకుంటున్నారని మాజీ మంత్రి జవహర్ అభిప్రాయపడ్డారు. ఈ హడావిడి అంతా కొన్ని వర్గాలను ఆకట్టుకోసమేనని అన్నారు. నిధులు లేని కార్పొరేషన్లు, కుర్చీలు లేని ఛైర్మన్ లు సామాజిక న్యాయమా? అని జవహర్ ప్రశ్నించారు. 26 కీలక సంస్థలకు మాత్రం జగన్ తన సొంత సామాజికవర్గం వారికి ఛైర్మన్లుగా నియమించారని జవహర్ ఆరోపించారు. ఏపీఐఐసీ, టీటీడీ వంటి వాటికి బలహీన వర్గాల ప్రతినిధులు పనికి రారా? అని జవహర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News