పాప ఆచూకీ ఇలా దొరికింది

Update: 2018-07-03 12:00 GMT

నిన్న కోఠీ ప్రసూతీ ఆసుపత్రిలో కిడ్నాప్ కి గురైన పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఆయాలా వచ్చి టీకా వేయిస్తానని చెప్పిన ఓ మహిళ నిన్న ఉదయం ఆరురోజుల పాపను తీసుకెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. 11 బృందాలుగా ఏర్పాటై కిడ్నాప్ చేసిన మహిళ ఎక్కడికి వెళ్లిందో సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన పోలీసులు బీదర్ బస్సు ఎక్కినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు బృందాలు బీదర్ వెళ్లే దారిలోని అన్ని గ్రామాల్లో గాలిస్తుండగా, బీదర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శిశువు ఉన్నట్లు తెలిసింది. దీంతో సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన ఆధ్వర్యంలో పోలీసులు పాపను తీసుకుని హైదరాబాద్ కి వస్తున్నారు. అయితే, పాపను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ బయపడి బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలివెళ్లినట్లు తెలుస్తోంది.

Similar News