బ్రేకింగ్ : కొత్తగూడెం డీఎస్పీకి కరోనా పాజిటివ్

కొత్తగూడెం డీఎస్పీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల లండన్ నుంచి ఆయన కుమారుడు కొత్తగూడెం వచ్చారు. డీఎస్పీ కుమారుడికి కూడా కరోనా సోకింది. అయితే దీనిని దాచిపెట్టిన [more]

Update: 2020-03-25 04:31 GMT

కొత్తగూడెం డీఎస్పీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల లండన్ నుంచి ఆయన కుమారుడు కొత్తగూడెం వచ్చారు. డీఎస్పీ కుమారుడికి కూడా కరోనా సోకింది. అయితే దీనిని దాచిపెట్టిన ఆయన తన కుమారుడితో కలసి ఒక ఫంక్షన్ కు కూడా హాజరయ్యారు. దీంతో ప్రభుత్వం డీఎస్పీ, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసి క్వారంటైన్ లో ఉంచింది. వీరిద్దరూ దగ్గరగా తిరిగిన 21 మంది నమూనాలను పరీక్షలకు పంపారు. ఈరోజు నివేదిక వచ్చే అవకాశముంది. కాగా డీఎస్పీ ఇంట్లో వంటమనిషికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్తగూడెంను రెడ్ జోన్ గా ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.

Tags:    

Similar News