వైఎస్ జగన్ పై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

Update: 2018-09-08 07:06 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతివ్వకుండా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతోనే ఉండేవాళ్లమని, తాము కమిట్ మెంట్ ఉన్న నాయకులమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు. కొండా సురేఖ హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ... గత ఎన్నికల ముందు జగన్ వేవ్ ఉండటంతో ఆయనను దెబ్బతీసేందుకు మమ్మల్ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మోసపూరితంగా కాంగ్రెస్ లో చేర్పించారని ఆరోపించారు. వైసీపీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత పరకాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించానని, కానీ కేసీఆర్ బతిమాలినందునే పరకాల వదిలి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశానన్నారు. తాను జగన్ కుటుంబానికి దూరమైన తర్వాత ఏనాడు వారితో మాట్లాడలేదని, కేవలం ఒక్క కార్యక్రమంలో జగన్ ఎదురుపడితే మాత్రమే పలుకరించామన్నారు. తనతో పాటు మంత్రివర్గంలో పనిచేసిన డీకే అరుణ వంటి వారితో అసెంబ్లీలో కూడా మాట్లాడేవాళ్లం కాదని, తాము ఉన్న పార్టీకి అంత కమిట్ మెంట్ తో ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Similar News