చంద్రబాబుకు మే వరకూ టైం ఇచ్చిన కొణతాల

Update: 2018-04-25 11:22 GMT

ఉత్తరాంధ్రకు అవసరమైన సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. మే లో జరిగే మహానాడులోపు బాబూ జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోతే తాము పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సాగు, తాగునీరు లేక ఉత్తారాంధ్ర ప్రజలు అల్లాడి పోతుంటే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. తాము సాగు, తాగునీరు కోరుతున్నామే తప్ప ఎటువంటి గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదన్నారు. మేలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోందని, ఆలోపు ప్రాజెక్టు పనులను ప్రారంభించకుంటే ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు ఆ లేఖలో కొణతాల పేర్కొన్నారు.

Similar News