బాధలో ఉన్నా… ఇప్పుడేం మాట్లాడను

ఏపీ మాజీ శాసనసభ్యుడు కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం విదేశాల నుంచి ఇవ్వాళ వచ్చారు. వారం క్రితం కెన్యాకు వెళ్లిన శివరాం ఇవ్వాళ ఉదయం ముంబాయి చేరుకుని [more]

Update: 2019-09-17 10:32 GMT

ఏపీ మాజీ శాసనసభ్యుడు కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం విదేశాల నుంచి ఇవ్వాళ వచ్చారు. వారం క్రితం కెన్యాకు వెళ్లిన శివరాం ఇవ్వాళ ఉదయం ముంబాయి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వస్తున తండ్రి కోడెల పార్థీవదేహం వద్దకు శివరాం బయల్దేరాడు. ఈ సమయంలో శివరాంను కదిలించగా తానిప్పుడేమి మాట్లాడనని, చాలా బాధలో ఉన్నానని మాట్లాడేందుకు నిరాకరించాడు. తండ్రి మృతదేహాన్ని చూసి శివరాం బోరున విలపించారు.

 

 

Tags:    

Similar News