లోకేష్ కు రాజకీయ బిక్ష వైఎస్ పుణ్యమే

యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చంద్రబాబులపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేధావిని అని చెప్పుకుని గెటప్ వేసుకుని వచ్చే మాజీ స్పీకర్ నిన్న [more]

Update: 2020-01-23 10:52 GMT

యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చంద్రబాబులపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేధావిని అని చెప్పుకుని గెటప్ వేసుకుని వచ్చే మాజీ స్పీకర్ నిన్న జరిగిన పరిణామాలకు ప్రధమ బాధ్యుడన్నారు. ఆయన ఎక్కడకు వెళ్లాలన్నా ఖర్చు పార్టీ భరాయంచాల్సేందేనన్నారు. మేధావి గెటప్ లో తిరుగుతారని పరోక్షంగా యనమల గురించి కొడాలివ నాని వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకు నలభై ఏళ్ల ఇండ్రస్ట్రీ చంద్రబాబు గ్యాలరీ ఎక్కారన్నారు. పప్పునాయుడికి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొడాలి నాని అన్నారు. వైఎస్ శాసనమండలిని తిరిగి పునరుద్ధరించడం వల్లనే లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారన్నారు. ఆ సభలో మేధావులు ఎవరూ లేరన్నారు. పెద్దల సభఅనేది తమ వ్యక్తిగతంగా ఇబ్బందులు సృష్టిస్తే పరవాలేదని, ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ వంటి బిల్లులను ఆపుతుంటే ఎలా అని కొడాలి నాని ప్రశ్నించారు. పెద్దల సభ అంటే సూచనలు, సలహాలు చేయాలి కాని ఇలా అడ్డపడకూడదన్నారు. మండలిలో కొందరు మంచి నేతలున్నారని, కొందరు తప్పు చేస్తే అందరికీ శిక్ష సరికాదని, మండలిని రద్దు చేయాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొడాలి నాని కోరారు.

Tags:    

Similar News