దేవినేని పై కొడాలి నాని ఫైర్

దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కావాలని రెచ్చగొట్టి ఉమ ఉద్రిక్తతలను సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. కంకర క్రషర్ల యజమానుల వద్ద చిల్లర పైసలు [more]

Update: 2021-07-28 12:16 GMT

దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. కావాలని రెచ్చగొట్టి ఉమ ఉద్రిక్తతలను సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. కంకర క్రషర్ల యజమానుల వద్ద చిల్లర పైసలు ఏరుకోవడానికే దేవినేని ఉమ అక్కడకు వెళ్లారన్నారు. అక్కడ ప్రజలను దుర్భాషలాడి ఉద్రిక్తతకు కారణమయ్యాడని కొడాలి నాని విమర్శించారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైసీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయితే ఎల్లో మీడియా దానిని ఉమ కారుగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. దేవినేని ఉమ రెచ్చగొట్టినందుకు, దళితులను దుర్భాషలాడినందుకే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వందల కోట్లు తన వ్యాపారాల ద్వారా సంపాదించారని, కంకర క్రషర్ల దగ్గర చిల్లర ఏరుకోవాల్సిన దుస్థితి అతనికి లేదని కొడాలి నాని అన్నారు.

Tags:    

Similar News