టీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి ఛాలెంజ్.. లక్ష ఇస్తా

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో రోడ్డుపై గుంత చూపిస్తే [more]

Update: 2020-11-22 06:06 GMT

టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. మీట్ ది ప్రెస్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో రోడ్డుపై గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు. ఇప్పుడు గుంతలు లేని రోడ్డు చూపిస్తే తాను లక్ష రూపాయలు ఇస్తానని కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చివేసిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News