కిషన్ రెడ్డి కార్యాలయంలో కరోనా కలకలం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన యువకుడి ని కరోనా అనుమానితుడిగా గుర్తించడంతో [more]

Update: 2020-04-16 01:33 GMT

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన యువకుడి ని కరోనా అనుమానితుడిగా గుర్తించడంతో కొన్ని గంటల పాటు కరోనా కలకలం వాతావరణం నెలకొంది.హైదరాబాద్ హైదరుగుడ లోని మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయనికి ఇద్దరు యువకులు మల్లేపల్లి నుంచి లెటర్ కోసం అక్కడ కు వచ్చారు. అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు అకస్మాత్తుగా కిందపడిపోయారు. వెంటనే ఆ యువకుడిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్లో చూపించారు. అక్కడి వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు కోసం కింగ్ కోఠి ఆసుపత్రికి పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ యువకుడికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వైద్యులు అతనిని ఇంట్లోనే ఉండాలని సూచించారు. దీంతో కిషన్ రెడ్డి కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు.

Tags:    

Similar News