ఏపీ బాధ్యత కూడా నాదే..!

హైదరాబాద్ తీవ్రవాద కార్యకలాపాలకు సేఫ్ జోన్ గా మారిందని, హైదరాబాద్ నగరాన్నిశాంతికి నెలవుగా మార్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2019-05-31 10:28 GMT

హైదరాబాద్ తీవ్రవాద కార్యకలాపాలకు సేఫ్ జోన్ గా మారిందని, హైదరాబాద్ నగరాన్నిశాంతికి నెలవుగా మార్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అమిత్ షాతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేనందున ఏపీ బాధ్యత కూడా తనదేనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తనవంతు తోడ్పాటునందిస్తానని పేర్కొన్నారు. నిన్న ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా ఆయనకు హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఆయనను ఢిల్లీలో ఘనంగా సన్మానించారు.

Tags:    

Similar News