డ్రామాలు ఆపి… అసలు పనిలోకి దిగండి

రాజధాని అమరావతి భూముల కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ వైసీపీ ఎంపీలు ధర్నా చేయడాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశంపైన [more]

Update: 2020-09-18 06:14 GMT

రాజధాని అమరావతి భూముల కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ వైసీపీ ఎంపీలు ధర్నా చేయడాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశంపైన సీబీఐ దర్యాప్తు కోరినా కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా దర్యాప్తునకు ఆదేశిస్తుందన్నారు. కానీ పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీలు దీనిపై ధర్నా చేయడం డ్రామాగా కేశినేని నాని అభివర్ణించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఆందోళనలు చేస్తే బాగుంటుందని, చెత్తరాజకీయాలు మానుకోవాలని వైసీపీ నేతలకు కేశినేని నాని హితవు పలికారు.

Tags:    

Similar News