కేరళకు యాపిల్ సంస్థ భారీ విరాళం

Update: 2018-08-25 10:39 GMT

వరదలతో చిన్నాభిన్నమైన కేరళకు ప్రముఖ సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా యాపిల్ సంస్థ కేరళకు రూ.ఏడు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి, మెర్సీ కార్ప్స్ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపింది. ఇళ్లు, స్కూళ్ల పునర్నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపింది. అంతేకాదు, తమ వినియోగదారులు కూడా కేరళకు అండగా ఉండాలని కోరింది. యాప్ స్టోర్, ఇట్యూన్స్ స్టోర్ లో విరాళం అందించేందుకు అదనంగా ఆప్షన్ పెట్టినట్లు, వినియోగదారులు 5 నుంచి 200 డాలర్ల వరకు దీని ద్వారా విరాళం ఇవ్వచ్చని ఆ సంస్థ తెలిపింది.

Similar News