ఆశ్రమం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Update: 2018-10-29 07:56 GMT

మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలోని రుషి ధర్మబోధ శ్రీ భవతి ఆశ్రమం వద్ద కలకలం రేగింది. నిర్మల్ కు చెందిన 24 ఏళ్ల బీటెక్ యువతిని రెండు నెలల క్రితం తల్లి ఆశ్రమంలో వదిలివెళ్లింది. అయితే, ఆశ్రమం వద్దకు వచ్చిన తల్లి తన కూతురిని చూపించాలని కోరగా ఆశ్రమ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ ప్రకాష్ సదరు యువతి తల్లి, పోలీసు సిబ్బందితో ఆశ్రమం వద్దకు రాగా భక్తులు లోనికి రానీయకపోగా వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో సదరు యువతిని బోయినపల్లి ఆశ్రమం నుండి గోధుమకుంట ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆమెను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, యువతి అకౌంట్ నుండి 6 లక్షలు డ్రా చేసుకున్నారు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని వివరించారు. అయితే, ఆశ్రమంలో మహిళల ఆదృశ్యం ఇది కొత్త కాదు. ఇప్పటికే ముగ్గురు మహిళలు ఆశ్రమం నుంచి అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆశ్రమంలో సోదాలు జరుపుతున్నారు.

Similar News