ఏపీలో చంద్రబాబు పాలనపై కేసీఆర్ వ్యాఖ్యలు

Update: 2018-10-16 13:39 GMT

తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలుగానే చెప్పుకోవాలని, వారు ఇంకా ఆంధ్రా వారిలా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఉడుములా ఇక్కడకు రాకముందు నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ బేధం లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, చిల్లర రాజకీయాల కోసం చంద్రబాబు లేని గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అసలు తెలంగాణ సమాజంలోనే వివక్ష లేదన్నారు. ఆంధ్రలో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, పూర్తిగా విఫలమయ్యాడని, శాంతి భద్రతలు కూడా సరిగ్గా లేవన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో ఏదో చేయాలని అనుకుంటున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితే తెలంగాణలో బర్రెలు కూడా తాళ్లు తెంపుకుని పారిపోతాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు శని అని పేర్కొన్నారు. జీహెచ్ఎసీలో ఇవాళ 12 మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు కార్పొరేటర్లుగా ఉన్నారు. అది తెలంగాణ గొప్పదనం అని పేర్కొన్నారు.

Similar News